ప్రధాని మోదీ ప్రసంగంలోని కీలక ప్రస్తావనలు ఇవే

Spread the love

భారత ప్రజలనుద్దేశించి.. మంగళవారం సాయంత్రం ప్రధాన నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం గురించి దేశ ప్రజలకు వివరించారు. ఇంకా దేశం నుంచి కరోనా మహమ్మారి వెల్లిపోలేదని.. లాక్‌డౌన్ మాత్రమే లేదని.. వైరస్ మాత్రం ఇంకా ఉందన్నారు. ఈ క్రమంలో మరింత అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.

కరోనా వైరస్‌పై కర్ఫ్యూతో పోరాటం ప్రారంభమైందని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా పోరాటం కొనసాగుతోందని.. దేశ ప్రజలు విజయవంతంగా వైరస్‌ను జయిస్తున్నారని తెలిపారు. వ్యాక్సిన్‌తోనే దానికి అంతం ఉంటుందని.. అప్పటి వరకు ప్రజలు వైరస్‌పై యుద్ధం చేస్తుండాలన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలలో ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ నడుస్తోందని.. వ్యాక్సిన్‌ వచ్చే వరకు ప్రజలంతా ఆరోగ్య నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు.

కొంతమంది మాస్కులు పెట్టుకోకుండా వీధుల్లో తిరుగుతున్నట్లు వీడియోలు, ఫోటోలలో కనిపిస్తోందని..అలా చేయడం మీకు, మీసాటి వారికి కూడా ప్రమాదకరమన్న విషయం గుర్తుపెట్టుకోవాలపన్నారు. అతి త్వరలోనే భారతదేశంలో వ్యాక్సిన్‌ వస్తుందని. .అంత వరకు వైరస్‌ను తేలికగా తీసుకోవద్దని ప్రజలకు సూచించారు. ఇక ప్రస్తుతం దేశంలో పండగల సీజన్‌ మొదలైందని.. ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు.


Spread the love
error: Content is protected !!