వావ్‌ మోదీ.. చెప్పకుండానే హోం మేడ్‌ మాస్క్‌తో ప్రజలకు సందేశాన్నిచ్చేశావ్..!

Spread the love

ప్రధాని మోదీ ఏం చేసినా అందులో ఎదో ఉంటుందన్నది చాలా మందికి తెలిసిందే. ఆయన ఏ స్టెప్ తీసుకున్నా.. అది ఓ సెన్షేషనల్‌గా మిగులతుంది. అంతేకాదు.. ఆ ఆలోచన మనకెందుకు రాలేదని ఇతర నేతల్లో కూడా వస్తుంది. తాజాగా.. శనివారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్ పొడగింపుతో పాటు.. పలు అంశాలపై ఈ మీటింగ్‌లో చర్చించారు. అయితే ఈ కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ హోం మేడ్‌ మాస్క్‌తో పాల్గొన్నారు. అంతేకాదు.. పలువురు ఇతర సీఎంలు కూడా మాస్క్‌లతో పాల్గొన్నారు.

అయితే ప్రధాని మోదీ హోం మేడ్‌ మాస్క్‌తో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఆయన దీంతో యావత్ భారత ప్రజానీకానికి ఓ సందేశాన్ని ఇచ్చినట్లైంది. మాస్క్‌లు ధరించడం అంటే.. మెడికల్ షాపుల్లో కొనాల్సిన పనిలేదు.. ఇంట్లో చేసుకున్నవి కూడా ఉపయోగించవచ్చన్నట్లు ఆయన అమూల్యమైన సందేశాన్నిచ్చారు. తెలుపు రంగులో ఉన్న మాస్క్‌ను ధరించే వీడియో కాన్ఫరెన్స్ కొనసాగించారు.

కాగా.. ప్రస్తుతం కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో వ్యాపిస్తుండటంతో.. అనేక రాష్ట్రాలు మాస్క్‌లు లేకుండా బయటకు వస్తే.. కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీచేశాయి. ఈ క్రమంలో మాస్క్‌ల కొరత ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంటి వద్దే మాస్క్‌లు తయారు చేసుకుని ధరిస్తే చాలన్న సూచనలు ప్రధాని చేశారంటూ నెటిజన్లు ట్వీట్స్‌ చేస్తున్నారు.


Spread the love
error: Content is protected !!