బ్రేకింగ్‌.. మరికాసేపట్లో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ..!

Spread the love

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో 20 లక్షలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసుల తీవ్రత పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే కర్ఫ్యూతో పాటు.. లాక్‌డౌన్‌ కూడా విధించాయి. ఈ క్రమంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అంతేకాదు.. అవసరమైన వైద్య సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. ఇక దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. రాత్రి 8.45 నిమిషాలకు ప్రసంగించనున్నట్లు న్యూస్ ఏజెన్సీ సంస్థ ఏఎన్‌ఐ ట్విట్టర్‌లో పేర్కొంది.


Spread the love
error: Content is protected !!