“మన్‌ కీ బాత్‌” “డిస్‌ లైక్స్‌”.. అసలేం జరిగింది..? మోదీ గ్రాఫ్‌ తగ్గించేందుకు కుట్ర జరిగిందా..?బీజేపీ ఏం చెబుతోంది..?

Spread the love

మన్‌ కీ బాత్‌.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు దగ్గరయ్యేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది. రెడీయో, టీవీ కార్యక్రమాల ద్వారా ఈ మన్‌ కీ బాత్‌ ప్రోగ్రాం జరగుతోంది. అయితే ఇటీవల ఆగస్టు 30వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశిస్తూ మాట్లాడిన కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం.. యూట్యూబ్‌ వేదికగా ప్రసారమైన ఈ కార్యక్రమానికి అత్యధికంగా డిస్ లైక్స్‌ రావడమే. లైక్స్‌ కంటే ఎక్కువగా డిస్‌ లైక్స్‌ రావడం.అది కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కార్యక్రమం ప్రారంభం నుంచే ఏక పక్షంగా డిస్‌ లైక్స్‌ రావడం ప్రారంభమైంది.

ఆగస్టు నెలకు సంబంధించిన “మన్‌ కీ బాత్‌” కార్యక్రమానికి సంబంధించిన వీడియోను అప్‌లోడ్‌ చేయగా.. ఏకంగా 9.61 లక్షలకు పైగా డిస్‌ లైక్‌లు వచ్చాయి. అదే సమయమంలో లైక్స్‌ మాత్రం 2.33 లక్షల మార్క్‌ను దాటింది. ఇది మంగళవారం ఉదయం వరకు వచ్చిన అప్డేట్స్‌.

 

 అయితే ఈ డిస్‌ లైక్స్‌ కొట్టింది నీట్,జేఈఈ విద్యార్ధులేమోనని అంతా అనుకున్నారు. ప్రస్తుతం ఈ నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఈ కార్యక్రమానకి పూనుకున్నారేమోనని సోషల్ మీడియా వేదికగా చర్చ కొనసాగుతోంది. అయితే ఈ వాదనను మరింత బలపర్చేలా అందులో వచ్చిన కామెంట్స్‌ కూడా అలానే ఉన్నాయి. నీట్,జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు కొనసాగాయి. అయితే కేంద్రం మాత్రం పరీక్షలను వాయిదా వేయకుండా నిర్వహించేందుకే మొగ్గుచూపింది. అంతేకాదు.. జీఈఈ పరీక్షలు మంగళవారం నాడు దేశ వ్యాప్తంగా జరిగాయి.

టర్కీ వేదికగా కుట్రలు..

అయితే ఇదంతా ఇలావుంటే.. అసలు కుట్రను చేధించేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. మోదీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు పనిగట్టుకుని కుట్రలు చేపట్టారని తెలిసినా.. ఆధారాల కోసం ప్రయత్నించగా.. సంచలన విషయాలు బయటపడ్డాయి. మోదీ నిర్వహించిన మన్‌ కీ బాత్‌ కార్యక్రమానికి వచ్చిన డిస్‌ లైక్స్‌ రెండు శాతం మాత్రమే భారత్‌ నుంచి నమోదయ్యాయని తేలింది. ఇక మిగతా 98 శాతం డిస్‌ లైక్స్‌ విదేశాల నుంచి వచ్చాయని బీజేపీ శ్రేణులు తెలిపారు. ఈ విషయాన్ని యూ ట్యూబ్‌ నుంచి వచ్చిన డేటా ప్రకారం గుర్తించామని తెలిపింది. మొత్తానికి ‘మన్ కి బాత్’ కార్యక్రమంపై మరక పడే విధంగా అంతర్జాతీయ వేదికగా కుట్రలు ప్రారంభమైనట్లు గుర్తించామని బీజేపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.


Spread the love
error: Content is protected !!