మీరట్‌లో భారీ అక్రమాయుధాల ఫ్యాక్టరీ గుట్టురట్టు.. ఇద్దరు అరెస్ట్.. వారిద్దరు ఏవరంటే..?

Spread the love

ఉత్తర్‌ప్రదేశ్‌లో అక్రమాయుధాల కర్మాగారాలపై పోలీసులు దృష్టి సారించారు. వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌ తర్వాత.. యూపీ పోలీసులు ఆయుధాలను అక్రమంగా తయారు చేస్తున్న ముఠాలను గుర్తించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురిని అరెస్ట్ కూడా చేశారు.

తాజాగా మీరట్‌ సమీపంలోని హుమాయున్‌ నగర్‌లోని ఓ ప్రాంతంలో అక్రమంగా ఆయుధాలను తయారు చేస్తున్న ముఠాను గుర్తించారు. పక్కా సమాచారం అందడంతో.. మీరట్ పోలీసులు సదరు కంపెనీపై దాడి చేసి.. రివాల్వర్‌లు, ఆయుధాలను తయారు చేస్తున్న సామాగ్రితో పాటు.. ఇతర ముడిసరుకులను గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ అక్రమాయుధాలను తయారు చేస్తున్న వారిద్దరిని సమీర్, షబీర్‌లుగా గుర్తించారు.


Spread the love
error: Content is protected !!