ఉత్తర్ప్రదేశ్లో అక్రమాయుధాల కర్మాగారాలపై పోలీసులు దృష్టి సారించారు. వికాస్ దుబే ఎన్కౌంటర్ తర్వాత.. యూపీ పోలీసులు ఆయుధాలను అక్రమంగా తయారు చేస్తున్న ముఠాలను గుర్తించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురిని అరెస్ట్ కూడా చేశారు.
తాజాగా మీరట్ సమీపంలోని హుమాయున్ నగర్లోని ఓ ప్రాంతంలో అక్రమంగా ఆయుధాలను తయారు చేస్తున్న ముఠాను గుర్తించారు. పక్కా సమాచారం అందడంతో.. మీరట్ పోలీసులు సదరు కంపెనీపై దాడి చేసి.. రివాల్వర్లు, ఆయుధాలను తయారు చేస్తున్న సామాగ్రితో పాటు.. ఇతర ముడిసరుకులను గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ అక్రమాయుధాలను తయారు చేస్తున్న వారిద్దరిని సమీర్, షబీర్లుగా గుర్తించారు.