ఉమ్మడి పాలమూరుజిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు

Spread the love

*ఉమ్మడి పాలమూరుజిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
*బీసీ నేత రాచాల యుగంధర్ చేరికతో మరింత బలపడ్డ కాంగ్రెస్
*3,4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతున్న రాచాల
*ఎన్నికలకు ముందు చేరి బీసీ ఓట్లను కాంగ్రెస్ వైపు తిప్పిన రాచాల
*వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గాల్లో BRS ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం
*BRS సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పట్టించిన బీసీనేత
*వనపర్తి, దేవరకద్ర, మక్తల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల గెలుపుకు క్రుషి
*రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రభావం చూపే అవకాశం

—–
బీసీ నేతగా జనంలో గుర్తింపు?

ఆ..నియోజకవర్గంలో ఒకే ఒక్కడు…పిలిస్తే నేనున్నాను అంటూ పలికే నాయకుడిగా గుర్తింపు పొందాడు. బడుగు, బలహీనవర్గాల కోసం పదేళ్లుగా అలుపెరుగని పోరాటం చేశాడు. బీసీల సమస్యలపై రాష్ట్ర. జాతీయ స్థాయిలో పోరాటం చేసి ఎన్నో విజయాలు సాధించాడు. ప్రజల సమస్యలపై గళమెత్తి ఏకంగా ప్రభుత్వంపైనే HRC లో వందకుపైగా కేసులు వేసి పోరాటం చేశాడు. తన నియోజకవర్గంలో ప్రజలకు విద్య, వైద్యం అందాలని భరోసాయాత్ర నిర్వహించి నియోజకవర్గ ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. అతనే బీసీ నేత…రాచాల యుగంధర్ గౌడ్. నిన్న మొన్నటివరకూ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ గా ఉన్న రాచాల…తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనూహ్యంగా కాంగ్రెస్లో చేరి…పార్టీ గెలుపుకు క్రుషి చేశారు.
…….
సొంత నియోజకవర్గం నుంచే పోరాటం?
మంత్రి నిరంజన్ రెడ్డికి చుక్కలు చూపిన రాచాల

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత…అధికారంలోకి వచ్చిన BRS పార్టీ…అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రచారం చేసిన నేతలపై కేసులు, అరెస్టుల పర్వం కొనసాగింది. ప్రజా సమస్యలపై ధర్నా చేయడానికి కూడా అనుమతి లేని పరిస్థితి. దాంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తే పరిస్థితి లేకపోయిన సందర్భంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ప్రజా సమస్యలపై గళమెత్తారు రాచాల యుగంధర్ గౌడ్. తన సొంత నియోజకవర్గం దేవరకద్రతోపాటు వనపర్తిజిల్లాలో అనేక సమస్యలపై పోరాడుతూ వచ్చారు. ప్రధానంగా అప్పటి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి భూ కబ్జాలు, అవినీతిపై పోరాటం కొనసాగించాడు. కేవలం పదేళ్లలో ఫాంహౌస్ లు , వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అంతేకాదు…ఏకంగా మంత్రి నిరంజన్ రెడ్డిపైనే HRCలో అనేక కేసులు వేశారు. దాంతో వనపర్తి నియోజక వర్గంలో తనకు తిరిగే లేదనుకున్న నిరంజన్ రెడ్డికి కొరకురాని కొయ్యగా మారాడు రాచాల. సమస్యలపై పోరాడే రాచాల యుగంధర్ ను కేసుల పేరుతో భయపెట్టాలని చూసినా బెదిరిపోలేదు. పాత కేసులను తవ్వి తీసినా అదరలేదు. వనపర్తి నియోజకవర్గంలో అభివ్రుద్దే జరగలేదని సాక్ష్యాలతో నిరూపించే ప్రయత్నం చేశాడు. పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని మంత్రికి ఓటు అడిగే నైతిక హక్కు లేదంటూ రాచాల చేసిన కామెంట్స్ జనంలోకి వెళ్లాయి.
భూ కబ్జా ఆరోపణలపై మాట తప్పిన మంత్రి ఫంక్షన్ హాల్, కోళ్ల ఫామ్ లలో కళాశాలలు నిర్వహించడం అభివృద్దా.? మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన అంశాలతో ప్రజల్లో మంత్రిపై వ్యతిరేకతను పెంచాయి.

భరోసా యాత్రతో జనంలోకి రాచాల
నియోజకవర్గ సమస్యలపై పోరాటం

ఇక 2014 నుంచి 2023 వరకూ దేవరకద్ర నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తిరుగులేని నేతగా ఉన్నారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై గళమెత్తే నేతలే లేని పరిస్థితి. ఈ పరిస్థితిలో బీసీ నేతగా ఉన్న రాచాల యుగంధర్ గౌడ్ నియోజకవర్గం అభివ్రుద్దిపై అధికార పార్టీని ప్రశ్నిస్తూ ఉక్కిరి బిక్కిరి చేశారు. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న కరివేన ప్రాజెక్టు నుంచి పదేళ్లయినా పంట పొలాలకు నీరు రాలేని పరిస్థితి ఉంది. కరివేన ప్రాజెక్టును సందర్శించి అక్కడి లీకేజీలు, ప్రాజెక్టులో జరుగుతున్న కోట్ల రూపాయల అవినీతిపై ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. దీంతోపాటు ఏళ్ల తరబడి శంకర సముద్రం భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సాగునీరు ప్రజలకు అందలేకపోయింది. ఈ విషయాన్ని మీడియా ద్రుష్టికి తీసుకొచ్చి ప్రభుత్వంపై పోరాటం కొనసాగించాడు. దాంతోపాటు నియోజకవర్గంలో పెద్దవాగు, ఊక చెట్టు వాగులపై చెక్ డ్యాంల నిర్వహణపై గళమెత్తారు రాచాల. చెక్ డ్యాంల పేరుతో ఇసుక మాఫియా నడుస్తోందని విమర్శించారు. దీని వెనుక దీనికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కొందరు బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు.
అంతేకాదు నియోజకవర్గంలో విద్య, వైద్యం పేరుతో ఏకంగా భరోసా యాత్ర నిర్వహించి నియోజకవర్గ ప్రజల్లో మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారు.
రాచాల భరోసా యాత్రతో దేవరకద్రలో డిగ్రీ కాలేజీ మంజూరైంది. వంద పడకల ఆస్పత్రి కూడా అనుమతి వచ్చినట్లు సమాచారం. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆల వెంకటేశ్వర రెడ్డి…మండలానికి ఒక్క జూనియర్ కాలేజీ తీసుకురాలేదని విమర్శించడం అప్పట్లో సంచలనం రేపింది.

ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన రాచాల
మూడు నియోజకవర్గాల్లో రాచాల ప్రభావం?
నామినేటెడ్ పోస్టుల రేసులో రాచాల?


కేవలం నియోజకవర్గ స్థాయిలోనే కాదు…ఓ బీసీ నేతగా రాష్ట్ర స్థాయిలోనూ అనేక సమస్యలపై పోరాటం కొనసాగించారు. ఇంటర్ విద్యార్థుల సమస్యలు, ఉపాధ్యాయులు, బీసీ జనగణన కోసం ఢిల్లీస్థాయిలో పోరాడారు. ఈ సమయంలోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల బరిలో దిగి, ప్రజా ప్రతినిధిగా గెలిచి ప్రజల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు. అయితే మారిన రాజకీయ సమీకరణాలతో చివరకు నవంబర్ 9, 2023లో వెయ్యి మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరారు. వెంటనే సొంత నియోజకవర్గం దేవరకద్రతోపాటు వనపర్తి, మక్తల్, గద్వాల నియోజకవర్గాల్లో విస్త్రుతంగా పర్యటించి అభ్యర్థుల గెలుపుకోసం క్రుషి చేశారు. రాచాల యుగంధర్ కాంగ్రెస్లో చేరికతో ఆ పార్టీకి ఊపిరొచ్చినట్లైంది. అప్పటివరకూ ప్రజా సమస్యలపై పోరాడిన వ్యక్తి కాంగ్రెస్ లోకి రావడంతో ప్రధానంగా దేవరకద్ర, వనపర్తి, మక్తల్ నియోజకవర్గాల్లో బీసీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లారు. ఏకంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సొంతూరులోనూ కాంగ్రెస్ కు మెజార్టీ ఓట్లు దక్కేలా రాచాల ప్లాన్ చేశారు. ఫలితంగా తమకు ఎదురేలేదని భావించిన అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డిని మట్టి కరిపించారు. మక్తల్ లో బీసీ నేత వాకిటి శ్రీహరి ఈజీగా గెలుపొందారు. టగ్ ఆఫ్ వార్ గా ఉన్న దేవరకద్రలో ఎమ్మెల్యే ఆలపై జి. మధుసూదన్ రెడ్డి గెలిచారు. ఇక తిరుగులేదని భావించిన వనపర్తిలో నిరంజన్ రెడ్డిపై మేఘారెడ్డి గెలించారు. గద్వాలలో గెలవకపోయినా…కాంగ్రెస్ కు భారీగానే బీసీలు ఓట్లు వేశారు. చివరి నిమిషంలో కాంగ్రెస్లో చేరి ఏకంగా 3 నియోజకవర్గాల్లో ప్రభావం చూసిన రాచాల యుగంధర్ గౌడ్…ఇఫ్పుడు ఆ పార్టీలో కీలక వ్యక్తిగా మారిపోయారు. అందుకే ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ నియమిస్తున్న పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్ రేసులోనూ రాచాల ఉన్నట్లు ఆ పార్టీ విశ్వనీయవర్గాల సమాచారం.

కాంగ్రెస్ లో రాచాలకు కీలక బాధ్యతలు?


రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ రాచాల యుగంధర్ గౌడ్ ఉమ్మడి పాలమూరుజిల్లాలోని కనీసం 3,4 నియోజకవర్గాల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. దేవరకద్ర, వనపర్తి, మక్తల్, గద్వాల్ నియోజకవర్గాల్లో బీసీ ఓట్లు కాంగ్రెస్కు రాబట్టేలా చేయడంలో రాచాల దిట్ట అనే ప్రచారం జరుగుతోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు ముందే రాచాలకు కీలక బాధ్యతలు అప్పజెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే…మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందనే వార్త అతియోశక్తి కాదేమో..?


Spread the love
error: Content is protected !!