ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన.. (పీఎంజేడీవై) ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2014 ఆగస్టు 28వ తేదీన ప్రారంభించారు. నేషనల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా ఈ బ్యాంకింగ్ స్కీమ్కు శ్రీకారం చుట్టారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం ముఖ్య ఉద్దేశం దేశంలోని మారుమూల గ్రామాలకు కూడా బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరించాలని. అంతేకాదు.. దేశంలోని ప్రతి పౌరుడికి ఓ బ్యాంక్ ఖాతా ఉండాలని. దీని ద్వారా ప్రభుత్వం అందించే పథకాల సొమ్మును నేరుగా అర్హుడి అకౌంట్లోకి చేరుకునే అవకాశం ఉంటుంది.
ఇక ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ కింద ఓపెన్ చేసే అకౌంట్ బేసిక్ సేవింగ్ అకౌంట్. దీని ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా వినియోగదారుడు చిన్న మొత్తాల పొదుపు (ఫిక్స్డ్ డిపాజిట్)చేసుకోవచ్చు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీమా పథకాలలో చేరవచ్చు. ఇంకా పెన్షన్ స్కీంలలో కూడా చేరవచ్చు. అంతేకాదు.. చిన్న మొత్తంలో ఎంత డబ్బునైనా డిపాజిటివ్ చేసుకోవచ్చు. విత్ డ్రా కూడా చేసుకోవచ్చు. ఈ ట్రాన్సాక్షన్స్కు ఎలాంటి రుసుము కూడా ఉండదు.
అయితే ఈ జన్ ధన్ అకౌంట్ ఉన్న వారికి ప్రస్తుతం ఉన్న లాభాలు ఎంటి? ఎలా ఉపయోగించాలి..? అన్న విషయాలతో పాటుగా.. ఇప్పటి వరకు అకౌంట్ లేని వారు ఎలా తీసుకోవాలి..? ఎక్కడ తీసుకోవాలి..? అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన అర్హతలు ఏంటన్నది తెలుసుకుందాం. 2014 నుంచి ప్రారంభమైన ఈ పథకంలో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 40 కోట్ల మంది వరకు అకౌంట్స్ ఓపెన్ చేసినట్లు సమాచారం. ప్రపంచంలోనే ఇది ఓ రికార్డుగా మిగిలిపోయింది.
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ తెరవడం ఎలా..
ఈ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ అనేది బేసిక్ సేవింగ్ అకౌంట్. ఈ బ్యాంక్ అకౌంట్ను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో ఓపెన్ చేయవచ్చు. అంతేకాదు.. పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా జన్ ధన్ అకౌంట్ పొందవచ్చు. ఇక ఈ అకౌంట్ తెరిచేందుకు భారతీయుడై ఉండాలి. ప్రభుత్వం ఇచ్చిన ఏదైనా గుర్తింపు కార్డు ఉండాలి. అడ్రస్ ఫ్రూఫ్ లేకపోతే.. ప్రస్తుతం నివసించే స్థలం పేరుతో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వడంతో పాటు ఏదైనా గుర్తింపు పత్రాన్ని జమచేసినా సరిపోతుంది. ఇక రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు( కొన్ని బ్యాంకులు ఒక్క ఫోటో మాత్రమే స్వీకరిస్తాయి) ఉంటే సరిపోతుంది. ఇక ఈ అకౌంట్ తెరవడానికి ఎవరి ష్యూరిటీ కూడా అవసరం లేదు.
బ్యాంకు మెట్లు ఎక్కకుండానే అకౌంట్ తీసుకోవడం..
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు బ్యాంకుకు వెళ్లాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిందే. ఎందుకంటే మండల పరిధిలోనే దాదాపు బ్యాంకులు ఉంటాయి కాబట్టి. అయితే ఈ బ్యాంకింగ్ వ్యవస్థ గ్రామీణ ప్రాంతానికి దగ్గరవ్వాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ మిత్రలను ఏర్పాటు చేసింది. ఓ జాతీయ బ్యాంకుతో అనుసంధానం చేసుకుంటూ ఓ బ్యాంక్ మిత్రాను గ్రామాల్లో ఏర్పాటు చేశారు. వీరు బ్యాంక్ ఉద్యోగి కాదు. కానీ వీరు బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ ఓపెనింగ్, క్యాష్ డిపాజిట్, విత్ డ్రా, ఇన్సూరెన్స్ స్కీమ్స్, పెన్షన్ స్కీమ్స్ వంటి సర్వీసులు అందిస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కస్టమర్ సర్వీస్ పాయింట్, బ్యాంకు మిత్రా, కియోస్క్ ఏజెంట్ పేరుతో సర్వీసులు అందిస్తున్నారు. వీరి ద్వారా ఈ జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. అంతేకాదు.. వీరివద్ద నుంచే అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయవచ్చు. దాదాపు సామాన్య ప్రజలు బ్యాంకుకు వెళ్లి చేసుకునే సర్వీసులన్నీ ఇక్కడి నుంచే పూర్తిచేసుకోవచ్చు. ఏదైనా ఇతర సర్వీసుల కోసం బ్యాంక్కు వెళ్లవచ్చు.
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ ద్వారా వచ్చే లాభాలు..
*ఈ అకౌంట్ ఎలాంటి ఖర్చు లేకుండా ఓపెన్ చేయవచ్చు
* అకౌంట్లో డబ్బులు లేనప్పటికీ ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు
* ఇతర సర్వీసులకు ఎలాంటి ఛార్జీలను వసూలు చేయరు
* ఈ జన్ ధన్ అకౌంట్కు ఏటీఎం కార్డుగా “రూపే కార్డు”ను అందజేస్తారు
* “రూపే కార్డు”కు ఎలాంటి ఫీజు ఉండదు
* బ్యాంకు ద్వారా వచ్చే సంక్షిప్త సమధానం (ఎస్సెమ్మెస్)లకు కూడా ఎలాంటి ఛార్జ్ చేయరు
* ఇక రూపే కార్డుకు కూడా వార్షిక రుసుం ఉండదు
* రూపే కార్డు ప్రమాద బీమాను కూడా కల్గి ఉంటుంది.
ఈ అకౌంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం కల్పించే ప్రభుత్వ పథకాల డబ్బులను నేరుగా అకౌంట్లోకి పొందే అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా అకౌంట్ ఉపయోగించే వారికి బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా కల్పించే అవకాశం ఉంటుంది.
మైనర్లకు కూడా జన్ ధన్ అకౌంట్..
ఇక ఈ జన్ ధన్ అకౌంట్లను మైనర్లకు కూడా తీయవచ్చు. అయితే ఈ అకౌంట్స్ ఓపెన్ చేసేందుకు కొన్ని బ్యాంకులు మాత్రమే అంగీకరిస్తున్నాయి బ్యాంకులో ఒత్తిడి కారణంగా మిగతా బ్యాంకులు నిరాకరిస్తున్నాయి). అయితే బ్యాంకు మిత్రా ద్వారా వారికి ఉన్న అనుమతులతో ఆధార్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సదరు మైనర్ తరఫున వారి సంరక్షకులు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
సో ఇక జన్ ధన్ అకౌంట్స్ ద్వారా ఉన్న లాభాలు ఇవి. ఇంకా మరింత సమాచారంతో పాటు.. లేటేస్ట్ అప్డేట్స్, ఈ అకౌంట్తో బీమా పథకాలను ఎలా పొందాలో మరో కథనంలో చూద్ధాం.