బీజేపీకి ఊహించని షాకిచ్చింది మిత్రపక్షంగా ఉన్న శిరోమణి అకాలీ దళ్. కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న హర్ సిమ్రత్ కౌర్ బాదల్ తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని కార్యాలయానికి చేరుకుని గురువారం నాడు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామాను ఆమోదించారు. అంతేకాదు వెంటనే సదరు మంత్రిత్వ శాఖ బాధ్యతలను మరో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్కు అప్పగించారు.
రైతులకు, వ్యవసాయానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టినన బిల్లుల విషయంలో.. శిరోమణి అకాలీద్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. లోక్సభలో చర్చ జరుగుతున్న సమయంలో అకాలీదళ్ నిరసనను ఆ పార్టీ నేత సుఖ్బీర్ బాదల్ తెలిపారు.
కాగా, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ.. అకాలీదళ్ ఎన్డీఏ కూటమిలోనే కొనసాగనున్నట్లు తెలుస్తోంది.