అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. రామ మందిర నిర్మాణం ప్రారంభమైనందకు అందరికీ అభినందనలు తెలిపారు. మర్యాద పురుషోత్తం ప్రభు రామ్ భగవాన్ ఆలయం న్యాయ ప్రక్రియ ద్వారా.. సామరస్య వాతావరణంలో నిర్మాణం జరుగుతుండటం అభినందనీయమన్నారు. ఈ ఆలయ నిర్మాణంతో ఇక్కడి పరిసరాలు ఆధునిక భారత్కు చిహ్నంగా మారుతుందని విశ్వాసంతో ఉన్నానంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు.
ఇక అంతకుముందు.. అనుకున్న ముహుర్తానికి రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమం ప్రధాని చేతుల మీదుగా ఘనంగా ముగిసింది. సరిగ్గా అభిజిత్ లగ్న ముహుర్తానికి పండితులు మోదీ చేతుల మీదుగా కృతువును ముగింపజేశారు. భూమి పూజ అనంతరం.. పునాధి నుంచి బొట్టుతీసుకుని ప్రధాని నరేంద్ర మోదీ నుదుటన ధరించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు.. యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధ్యక్షులు మహంత్ నృత్య గోపాల్ దాస్ పాల్గొన్నారు.