యూపీలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ముఖ్యంగా మరో వారం రోజుల్లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఇప్పుడు కరోనా టెన్షన్ పెడుతోంది. రామ జన్మభూమి మందిర పూజారికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు పలు జాతీయ మీడియా ఛానెళ్లు పేర్కొన్నాయి. మందిర పూజారితో పాటుగా 16 మంది పోలీసులకు కూడా కరోనా పాజిటివ్గా తేలినట్లు “సీఎన్ఎన్ న్యూస్18″లో పేర్కొంది.
కాగా, ఆగస్టు 5వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రామనికి దాదాపు 200 మంది హాజరుకానున్నారు.