పల్స్ ఆక్సీమీటర్.. ప్రస్తుతం ఒక్కసారిగా డిమాండ్ పెరిగిన పరికరం. సాధారణంగా.. అనేక మంది డిజిటల్ థర్మా మీటర్లను ఇళ్లల్లో ఉంచుకుంటారు. దీని ద్వారా మనకు శరీరంలో ఉన్న ఉష్ణోగ్రత.. (జ్వరానికి సంబంధించి) తెలుసుకోవచ్చు. మనిషికి జ్వరం తీవ్రత ఎంత ఉందన్నది డిజిటల్ రూపంలో చూపిస్తుంది. అంతేకానీ.. కరోనా మహమ్మారి గురించి మాత్రం ఏమాత్రం తెలియజేయదు. ప్రస్తుత కరోనా కాలంలో థర్మా మీటర్తో పాటు.. ఆక్సీమీటర్ను కూడా చాలా మంది ఇళ్లల్లో ఉంచుకుంటున్నారు. ఇది మనిషి శరీరంలో ఉన్న ఆక్సిజన్ లెవల్స్ గురించి తెలియజేస్తుంది. ఈ ఆక్సీమీటర్తో హార్ట్ బీట్ కూడా తెలుసుకోవచ్చు. అదే సమయంలో ఆక్సిజన్ లెవల్స్ కూడా డిస్ప్లే అవుతాయి.
ప్రస్తుత ఈ తరుణంలో వీటి డిమాండ్ ఒక్క సారిగా పెరిగిపోయాయి. ఇందుకు కారణం.. కరోనా సోకిన వ్యక్తుల్లో దీర్ఘకాలిక వ్యాధులు కానీ.. కరోనా తీవ్రత పెరిగిన సమయంలో మనిషి శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి.. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇది కరోనా మహమ్మారికి చెందిన ఓ లక్షణం అన్న విషయం తెలిసిందే. ఒక వేళ ఆక్సిజన్ లెవల్స్లో తగ్గుదల కనిపిస్తే.. ఈ సమయంలో ఆక్సిజన్ తప్పనిసరి అవుతుంది. దీనిని ముందే గమనించి.. వైద్యులను సంప్రదించడం ద్వారా.. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడవచ్చు. దీనికి సంబంధించిన వివరాలను సమీప వైద్యుడిని సంప్రదించడం ద్వారా.. పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇక పల్స్ ఆక్సీమీటర్లో ఆక్సిజన్ శాతం, హార్ట్ బీట్ ఎంత ఉండాలన్న దానిపై సమీప ఆరోగ్య నిపుణులను, స్పెషలిస్టు డాక్టర్లను సంప్రదించి.. ఉపయోగించడం మంచిది.
ఆక్సీమీటర్ వాడకం..
ఇది చిన్న క్లిప్ మాదిరిగా ఉంటుంది. దీనిపై ఓ బటన్ ఉంటుంది. బటన్ ఆన్ చేసిన తర్వాత… క్లిప్ మధ్య భాగంలో చూపుడు వేలు పెట్టాలి. ఒక నిమిషం వ్యవధిలో డివైజ్ డిస్ప్లే మీద ఆక్సిజన్ శాతం, హార్ట్ బీట్ ఎంత ఉందో తెలుస్తుంది. ఇక ఈ ఆక్సీమీటర్ ధర.. మార్కెట్లో క్వాలిటీని బట్టి ధరలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో రూ. 600/- నుంచి మొదలుకొని.. దాదాపు రూ.5000/- వరకు ఉన్నాయి.