కలకలం రేపుతోన్న రాహుల్ ట్వీట్‌.. వ్యాక్సిన్‌ లెక్కలు ఓ వ్యక్తి ఫోటో వెనుక అంటూ…

Spread the love

సౌతాఫ్రికాలో బోట్స్‌వానాలో కనిపించిన కొత్త రకం కరోనా వేరియంట్‌పై యావత్‌ ప్రపంచం మరోమారు వణికిపోతోంది. కరోనా వైరస్‌ రూపాంతరం చెంది ఒమిక్రాన్‌గా అలజడి సృష్టిస్తుండటంతో కేంద్రప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. విదేశాల నుంచి వచ్చిన వారిని గమనిస్తోంది. ఈ క్రమంలో దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగంగా చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 121 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ క్రమంలో వయనాడ్‌ ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ ఓ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌లో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతూ.. వ్యాక్సిన్‌ లెక్కలపై కామెంట్స్‌ చేశారు.

ప్రస్తుతం కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ తీవ్రమైన ముప్పు కలిగించే అవకాశం ఉందని ట్వీట్‌ చేశారు. ఇక మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ లెక్కలను ఓ వ్యక్తి ఫోటో చాటున ఎంతో కాలం మరుగుపరచడం సాధ్యం కాదని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ప్రధాని మోదీని ఉద్దేశించి పరోక్షంగా చేశారు. ఇక ఈ ట్వీట్‌తో ఓ జాతీయ మీడియా కథనాన్ని కూడా అటాచ్‌ చేస్తూ.. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సంఖ్యను శాతంలో పేర్కొన్నారు. దేశంలో ఇప్పటి వరకు రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య 31.19 శాతం మాత్రమే ఉందని.. గత వారం రోజులుగా వ్యాక్సినేషన్ శాతం యావరేజ్‌గా రోజుకు 6.8 మిలియన్లు అంటూ పేర్కొన్నారు. ఇక దేశంలో మిగిలిన జనాభాకు పూర్తిగా వ్యాక్సినేషన్‌ చేయాలంటే రోజుకు సగటున 23.3 మిలియన్ల డోసులను పంపిణీ చేయాల్సి ఉంటుందని రాహుల్‌ గాంధీ ట్వీట్‌లో పేర్కొన్నారు.


Spread the love
error: Content is protected !!