కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో భారత్ తరఫున పాల్గొనేందుకు ఆయన రష్యా టూర్ వెళ్లారు. బుధవారం నాడు రాజధాని మాస్కోకు చేరుకోవడంతోనే ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే ఈ క్రమంలో భారత్ సంప్రదాయాలను రాజ్నాథ్ పాటించారు. ప్రస్తుతం కరోనా సంక్షోభం కారణంగా దాదాపు అన్ని దేశాల ప్రజలు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం మానేశారు. అయితే రష్యాలో గత కొద్ది రోజులుగా కరోనా మహమ్మారి అదుపులోకి వస్తుండటంతో అక్కడ సామాన్య పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో మళ్లీ షేక్ హ్యాండ్ కల్చర్ స్టార్ట్ అయినట్లు అనిపిస్తోంది.
మాస్కో ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు వెల్కమ్ చెప్పేందుకు వచ్చిన రష్యన్ అధికారులు కొందరు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించగా.. రాజ్నాథ్ సింగ్ మాత్రం నమస్తే చెప్తూ పలకరించారు. గ్రీట్ చేసేందుకు వచ్చిన అధికారులకు నమస్తే చెప్తుండగా.. ఓ రష్యన్ అధికారి పొరబాటున రాజ్నాథ్ సింగ్కు షేక్హ్యాండ్ ఇవ్వబోగా.. రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా నమస్తే పెట్టారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన ఓ క్లిప్ను డిఫెన్స్ మినిస్ట్రీస్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.