రామ మందిర “భూమి పూజ”పై రాజ్‌ థాక్రే భిన్న స్వరం

Spread the love

ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం చేపట్టిన భూమిపూజ కార్యక్రమం గురించి తెలిసిందే. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. దాదాపు 200 మందితో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. అయితే ఈ భూమి పూజ కార్యక్రమంపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్‌థాక్రే భిన్న స్వరాన్ని పలికారు. ప్రస్తుత కరోనా సంక్షోభంలో ఈ కార్యక్రమం చేపట్టడం అవసరం లేదన్నట్లుగా ఓ మరఠా ఛానెల్‌కు సంబంధించిన ఇంటర్వ్యూలో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి జాతీయ మీడియా కూడా ధృవీకరించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు సాధారణంగా మారిన తర్వాత కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రే తీరుపై మండిపడ్డారు. ఈ-భూమి పూజ (వర్చువల్‌) నిర్వహించాలన్న వ్యాఖ్యలను రాజ్‌థాక్రే కొట్టిపారేశారు.


Spread the love
error: Content is protected !!