“మహా” రాజకీయాల్లో కలకలం.. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు దేనికి సంకేతం..!

Spread the love

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారనున్నాయా..? అంటే అవుననే అనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనం. కొందరు కింది స్థాయి కార్యకర్తలు శివసేనా పార్టీ నుంచి ఎన్సీపీలోకి మారడం..  ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా వ్యాఖ్యలు చేయడం చూస్తే.. ఇప్పుడు మహా రాజకీయాలు హీటెక్కేలా ఉన్నాయి. ఇప్పటికే రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో సోమవారం నాడు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

ఎన్సీపీ శివసేనాకు మద్దతు ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదని.. ఎన్సీపీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలకడంతో పాటు.. ఎన్సీపీలో చేరితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఇలా జరిగితే దేశాభివృద్దితో పాటు.. మహారాష్ట్రకు కావాల్సిన నిధుల్ని మరింత తెచ్చుకోవడమే కాకుండా.. రాష్ట్రాభివృద్ది వేగవంతమవుతందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో పాటు.. కాంగ్రెస్ పార్టీ కూడా శివసేనాపై కాస్త గుర్రుగానే ఉన్నట్లు కన్పిస్తోంది. ఈ క్రమంలో ఎన్సీపీ ముందస్తు జాగ్రత్తగా.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అటు రాష్ట్రాభివృద్ధితో పాటు.. దేశాభివృద్దికి తోడ్పడవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కరోనా కేసులను కూడా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుని వేగవంతగా రాష్ట్రంలో కరోనా కట్టడి చేయవచ్చని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ఎన్సీపీ ఆలోచిస్తే మహా రాజకీయాల్లో పెనుతుఫాన్ రానుంది.


Spread the love
error: Content is protected !!