రిపబ్లిక్‌ టీవీ చీఫ్ ఎడిటర్‌పై దాడి.. మండిపడుతున్న ఆర్నబ్ ఫ్యాన్స్‌..!

Spread the love

ఫైర్‌ బ్రాండ్‌ జర్నలిస్ట్‌గా పేరున్న రిపబ్లిక్‌ టీవీ చీఫ్ ఎడిటర్‌ అర్నబ్‌ గోస్వామిపై నిన్న రాత్రి అగంతకులు దాడికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి ముంబైలోని తన నివాసానికి వెళ్తుండగా గుర్తు  తెలియని వ్యక్తులు ఇద్దరు బైక్‌పై వచ్చి దాడికి పాల్పడ్డారు. ఆర్నబ్‌ ఉన్న కారు ముందు బైక్‌ ఆపి.. కారుపై సిరా చల్లారు. ఆ తర్వాత కారులో ఉన్న ఆర్నబ్‌పై అతని భార్యపై దాడికి పాల్పడ్డట్లు.. ముంబైలోని ఎన్‌ఎంజోషీ మార్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దాడాకి పాల్పడ్డట్లు అనుమానిస్తున్న ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై సెక్షన్‌ 341 మరియు 504 కింద కేసులు నమోదు చేశారు.

కాగా తనపై దాడికి పాల్పడింది కాంగ్రెస్ కార్యకర్తలేనని ఆర్నబ్ గోస్వామి ఆరోపించారు. తమపైన జరిగిన దాడికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బాధ్యత వహించాలన్నారు. ఆర్నబ్‌పై దాడిని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఖండించారు. జర్నలిస్టులపై దాడిని ఖండిస్తున్నానని.. దాడికి పాల్పడ్డ వారికి చట్టపరంగా చర్యలు తప్పవన్నారు.

 


Spread the love
error: Content is protected !!