ఓట్ల ద్వారా దేశ భవిష్యత్తును నిర్దేశించివచ్చు.. దేశ ప్రజలకి ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక సందేశం..

Spread the love

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ Dr. మోహన్ భగవత్ లోక్ సభ 2024 తొలిదశ ఎన్నికల్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మహారాష్ట్రలోని నాగపూర్ పోలింగ్ స్టేషన్ కి ఉదయమే విచ్చేసి తన ఓటును వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఓటు వేయడం అనేది మన హక్కు అని.. దానిని ఖచ్చితంగా వినియోగించుకోవాలన్నారు. దేశ ప్రజలను ఉద్దేశిస్తూ.. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు.100% ఓటింగ్ జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

 

ఎన్నికలు అనేవి వచ్చే 5 సంవత్సరాలు దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయని అన్నారు. దేశ భవిష్యత్తును మనం వేసే ఓట్ల ద్వారా నిర్దేశించవచ్చని.. అందుకే నా భాద్యతగా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు.


Spread the love
error: Content is protected !!