ఇంత దారుణమా..? పాయింట్ బ్లాక్‌లో గన్‌ పెట్టి.. హిందూ “సాధ్వీ”పై గ్యాంగ్‌ రేప్‌..!

Spread the love

దేశంలో రోజురోజుకు క్రైం కేసులు పెరిగిపోతున్నాయి. అందులో ముఖ్యంగా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎంతటి కఠినమైన చట్టాలు వచ్చినప్పటికీ కామాంధుల్లో మాత్రం ఎలాంటి భయం కన్పించడం లేదు. నిన్న మొన్నటి వరకు మైనర్ బాలికలు, యువతులు, మహిళలపై అత్యాచారాలన్న వార్తలు చదివే ఉంటారు. కానీ ఇప్పుడు ఏకంగా ఎంతో పవిత్రంగా సన్యాసం స్వీకరించి అన్ని బోగాలకు దూరంగా ఉంటూ.. కాషాయ వస్త్రాలను ధరించిన ఓ సాధ్వీపై అత్యాచారం జరిపారు దుండుగులు. ఈ సంఘటన రెండు రోజుల క్రితం జార్ఖండ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌ రాష్ట్రంలోని గొడ్డా జిల్లాలో మహిళా సాధ్వీలకు చెందిన “మహిళా సత్సంగ్” అనే ఓ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమం దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుతం ఈ ఆశ్రమంలో ఆరుగురు మాత్రమే ఉంటున్నట్లు సమాచారం. వీరితో పాటు ఓ వ్యక్తి కూడా ఉంటున్నారు (సెక్యూరిటీ అని సమాచారం). అయితే సోమవారం అర్ధరాత్రి 2.00 గంటల ప్రాంతలో ఆశ్రమ ప్రహారీ గోడ దూకి నలుగురు దుండగులు ఆయుధాలతో ప్రవేశించారు.

పాయింట్ బ్లాక్‌ వద్ద గన్‌ పెట్టి మరీ..

అనంతరం అక్కడ ఉన్న సాధ్వీలను ఓ రూంలో బంధించారు. ఈ క్రమంలో ఆశ్రమంలోనే ఉన్న ఓ వ్యక్తి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో దుండుగులు అతడిపై దాడికి దిగి ఓ గదిలో బంధించారు. అనంతరం 46 ఏళ్ల సాధ్వీపై నలుగురు దుండుగులు గది నుంచి బయటకు ఈడ్చుకుని దాడికి పాల్పడ్డారు. పాయింట్ బ్లాక్ వద్ద గన్‌ పెట్టి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనకు సంబంధించి బాధిత సాధ్వీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

విచారణ వేగవంతంగా..

బాధిత సాధ్వీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ముఫ్ఫసిల్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆశ్రమంలో ఉన్న వ్యక్తి ఇచ్చిన సమాచారంతో అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. నలుగురు వ్యక్తులు ఆయుధాలతో ఆశ్రమం ప్రహారీ గోడ దూకి లోనికి వచ్చారని సదరు వ్యక్తి పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు సేకరించిన సమాచారంతో నిందితుల్లో ఒకర్ని దీపక్ రానాగా గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దీపక్ రానాను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.

లాక్‌డౌన్‌ కారణంగా ఇక్కడే ఉంటూ..

కాగా, బాధిత సాధ్వీ.. ప్రవచనాలు చెప్పేందుకు ఈ ఆశ్రమానికి ఫిబ్రవరిలో వచ్చిందని అక్కడ ఉన్న వ్యక్తి తెలిపాడు. ఆమె ధన్‌బాద్‌ ప్రాంతా వాసి అని.. ప్రస్తుతం వారణాసిలో ఉంటున్నట్లు తెలిపారు. అయితే ఫిబ్రవరిలో ప్రవచనలు చెప్పేందుకు వచ్చిన తర్వాత.. లాక్‌డౌన్ రావడంతో ఇక్కడే ఉండిపోయినట్లు తెలిపాడు.


Spread the love
error: Content is protected !!