ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ శనివారం అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో.. వెంటనే ఆయన్ను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. వెంటనే వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు చేయగా.. రిపోర్టులో నెగెటివ్గా తేలింది.
అయితే మరో రెండు రోజులపాటు ఆయన్ను ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్లో కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. మరో రెండు మూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకుంటానంటూ పేర్కొన్నారు.