తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి నూతన అధ్యక్షుడిగా బండి సంజయ్ ని అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలో ఉన్న అతన్ని తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ దేవిక రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సంజయ్ కి గులాబీ మొక్కను అందచేశారు. అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు సంజయ్ కార్యాలయంలో ఈ మొక్క అలాగే ఉండాలని.. సూచించినట్లు తెలిసింది.
కాగా, మార్చ్ 15 ఆదివారం నాడు బండి సంజయ్ హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా సంజయ్ కి ఘన స్వాగతం పలికేందుకు కమల దళ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.