బ్రేకింగ్‌ న్యూస్‌.. కేంద్రం కోరడంతో వ్యాక్సిన్‌ ధర తగ్గించిన సిరం సంస్థ

Spread the love

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ఎంతో కీలకం. ఈ క్రమంలో మే1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 18 ఏళ్ల పై బడ్డ వారందరికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. అయితే కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఉచితంగా అందజేస్తున్నప్పటికీ.. పలు రాష్ట్రాలు వ్యాక్సిన్‌ను కొనేందుకు రెడీ అయ్యాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ సంస్థలు ధరలను ప్రకటించడంతో.. ఈ ధరల్లో వ్యత్యాసం ఉండటంపపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు భగ్గుమంటున్నాయి. ఒకే వ్యాక్సిన్‌ను కేంద్రానికి ఒక ధరకు.. రాష్ట్రానికి ఒక ధరకు అందజేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నాయి. అయితే కేంద్రంతో ముందస్తు ఒప్పందం ప్రకారమే ఆ ధరకు ఇస్తున్నామని. ఒప్పందం ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ధరకైతే ఇస్తామో.. అదే ధరకు కేంద్రానికి కూడా ఇస్తామని స్పష్టంగా పేర్కొన్నాయి.

అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వ్యాక్సిన్‌ ధరలను తగ్గించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో స్పందించిన సిరం సంస్థ అధినేత అధర్‌ పునావాలా.. కోవిషీల్డ్‌ ధరను తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే వ్యాక్సిన్‌లకు మాత్రమే ఈ తగ్గింపు ధరలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ తగ్గించిన ధరలు కూడా వెంటనే అమలులోకి వస్తాయన్నారు. తగ్గించిన ధరలతో రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయలు ఆదా అవ్వడమే కాకుండా.. మరింత ఎక్కువ మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉందన్నారు. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ధర రాష్ట్రాలకు రూ.400కు అమ్ముతామని ఇంతకు ముందు ప్రకటించారు. అయితే ఇప్పుడు కేంద్రం ధరలను తగ్గించాలని కోరిన మేరకు.. ఈ ధరలను రూ.300కు తగ్గిస్తున్నట్లు తెలిపారు.

అయితే కేంద్ర ప్రభుత్వం.. సిరం సంస్థతో పాటు.. భారత్‌ బయోటెక్‌ సంస్థను కూడా కోరింది. అయితే సిరం సంస్థ మాత్రం స్పందించి.. ధరను తగ్గించింది.

 


Spread the love
error: Content is protected !!