పాకిస్తాన్లో మైనార్టీలైన హిందువుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. రోజురోజుకు మైనార్టీలపై ముస్లింల వేదింపులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే యుక్తవయస్సులో ఉన్న యువతులను అపహరించుకుని పోతూ.. బలవంతపు మతమార్పిడి చేస్తూ వివాహాలు చేసుకుంటున్నారు. అంతేకాదు.. హిందువుల ఆనవాళ్లును చెరిపేసేందుకు అక్కడి ఇస్లాం మత చాందసవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మైనర్ బాలికలపై వేధింపులు కూడా ఎక్కువయ్యాయి.
తాజాగా.. సింధ్ ప్రాంతంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మిర్పూర్ ఖాస్ ప్రాంతంలో ఓ ఏడేళ్ల బాలికపై ఇటుకబట్టి యజమాని దారుణంగా హింసించాడు. ఇటుకల బట్టీలో పనిచేస్తున్న తన తల్లిదండ్రులతో మీనా అనే బాలిక పనిలోకి వచ్చింది. అంతేకాదు.. తన తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూ కాస్త పనిచేస్తూ ఉంది. ఈ క్రమంలో తనకి ఆకలేసి.. అక్కడే ఉన్న పోలంలోని ఓ పదార్థాలను తినేందుకు ప్రయత్నించింది. ఈ ఘటనను గమనించిన సదరు ఇటుకల బట్టి సదరు బాలికపై మెటల్ వస్తువులతో తీవ్రంగా కొట్టాడు. దెబ్బలు తాలలేక సదరు బాలిక సొమ్మసిల్లిపోయింది. తలకు తీవ్రంగా గాయం కావడంతో.. బాలిక తల్లిదండ్రులు ఆవేదనకు గురయ్యారు.
అయితే జరిగిన ఘటనను ఎవరికీ చెప్పొద్దంటూ ఇటుకల బట్టి యజమాని బెదిరింపులకు దిగాడు. అయితే తన బాలికపై క్రూరత్వంగా ప్రవర్తించాడని.. దీనిని తాను సహించలేనంటూ ఆ బాధిత తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనపై సదరు యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. కేసు నమోదు చేయాలని ప్రాదేయపడ్డాడు. అయితే పోలీసులు మాత్రం మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కథనాన్ని డాన్ పత్రిక ప్రత్యేకంగా ప్రచురించింది.