శివసైనికుల మొండితనంతో తెలంగాణ సర్కార్ ఓ అడుగు దిగివచ్చింది. హిందూ భక్తులకు జరుగుతున్న అన్యాయంపై శివసేన పార్టీకి చెందిన యువసేన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ చేసిన ఉద్యమంతో ఎట్టకేలకు న్యాయం జరిగింది. అచ్చంపేట ఉమామహేశ్వరం, మద్దిమడుగుల దేవాలయాలకు వెళ్లే భక్తుల వద్ద నుంచి.. అటవీ ప్రాంతంలో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ.. హిందువుల నడ్డి విరిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అక్రమ చెక్పోస్టును ఎత్తివేయాలంటూ శివసేనా పార్టీ (తెలంగాణ) యువసేన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
హిందువుల వద్ద నుంచి అక్రమంగా వసూలు చేసేందుకు పెట్టిన చెక్పోస్టులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తొలుత అధికారులు చెక్పొస్టును తొలగించకుండా యథావిధిగా డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ.. శివసేనా పార్టీకి చెందిన నాయకులు.. స్థానిక హిందూ సంస్థలతో కలిసి ఉద్యమంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో తెలంగాణ సర్కార్ మెట్టు దిగివచ్చింది. అక్రమంగా పెట్టిన చెక్పోస్టును తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం మెడలు వంచడం అనేది హిందువుల విజయంగా పేర్కొంటూ శివసేన పార్టీ (మహబూబ్ నగర్-హైదరాబాద్-రంగారెడ్డి MLC అభ్యర్థి) సింకారు శివాజీ ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలోనీ అంబేద్కర్ చౌరస్తా వద్ద బాణా సంచా కాల్చి, మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ , రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడ హిందువులకు హాని జరిగినా,అన్యాయం జరిగినా పోరాటం చేయడంలో ముందుంటమంటూ సింకారు శివాజీ పేర్కొన్నారు.
Read More
ఓ హిందూ మేలుకో…!!ఆ గుడికి టూ వీలర్పై వెళ్లాలంటే జేబుకు చిల్లేనట..!తెలంగాణలో ఏం జరుగుతోంది..?