కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర సంచలన నిర్ణయం..!

Spread the love

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక చోట్ల ఆక్సిజన్‌ కొరత తలెత్తుతోంది. ఇటీవల అనేక మంది ఆక్సిజన్‌ కొరతతోనే మరణించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ పరంగా కాకుండా.. ప్రైవేట్‌ కంపెనీలతో చర్చలు ప్రారంభించింది. ఆక్సిజన్ తయారీ వేగవంతం అయ్యేందుకు అనేక చర్యలు తీసుకుంటూ.. అదే సమయంలో అవసరమైన రాష్ట్రాలకు సప్లే చేయడానికి స్పెషల్‌ ట్రైన్స్‌ను (ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌)లను ప్రారంభించింది.

ఇదిలావుంటే శ్రీ రామ జన్మ భూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల రామ మందిర నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫండ్‌ డ్రైవ్‌ జరిపింది. ట్రస్టు ఆశించిన దానికంటే పెద్ద ఎత్తున ఫండ్‌ వచ్చింది. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఈ కొరతను అధిగమించేందుకు రెండు ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ను ఇన్‌స్టలేషన్‌ చేసేందుకు ఫండ్స్‌ను ప్రొవైడ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రెండు ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ను అయోధ్యలోని దశరథ మెడికల్‌ కాలేజీలో ఇన్‌స్టలేషన్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. మందిర నిర్మాణం కోసం రూ.1700 కోట్ల వరకు అవసరముండగా.. నిధి సేకరణ ద్వారా దాదాపు రూ.3 వేల కోట్ల వరకు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజల సంక్షేమం కోసం ప్రస్తుత పరిస్థితిలో ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేయడం కోసం ఈ పుణ్యకార్యం కోసం వచ్చిన నిధులను వెచ్చించడం హర్షణీయమంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

 


Spread the love
error: Content is protected !!