దేశ వ్యాప్తంగా ఓ వైపు లాక్డౌన్ ఉన్నప్పటికీ.. రామ మందిర నిర్మాణానికి మాత్రం విరాళాలు ఆగడం లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న 4.0 లాక్డౌన్లోనే.. మంగళవారం నాడు.. మందిర నిర్మాణానాకి పనులు ప్రారంభమైనట్లు ట్రస్ట్ చైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ప్రకటించారు. ఉదయం పూజలు నిర్వహించిన తర్వాత.. మందిర నిర్మాణానికి సంబంధించిన విషయాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగీతో పాటు పలువురు హాజరయ్యారు.
అయితే ఈ లాక్డౌన్ కొనసాగుతున్న క్రమంలో.. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు విరాళాలు పెద్ద మొత్తంలో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ సమయంలో.. రూ.4.60 కోట్ల విరాళాలు వచ్చినట్లు తెలిపారు. కాగా, మందిర నిర్మాణానికి విరాళాలు ఇచ్చే వారికి.. పన్ను మినహాయింపు కూడా ఉన్న విషయం తెలిసిందే. కాగా, మందిర నిర్మాణం కోసం.. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు ఇచ్చే విరాళాలకు.. ఆదాయం పన్ను నుంచి మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఉత్తర్వులు కూడా జారీచేసింది. ఈ ట్రస్టుకు దాతలు ఇచ్చే విరాళాలను ఆదాయం పన్ను చట్టం, 1961 సెక్షన్ 81 జీ ప్రకారం మినహాయింపు ఇచ్చారు.