అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ రథం దగ్ధం సంఘటన ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని బీజేపీ-జనసేనా ఆరోపిస్తోంది. గతంలో పీఠాపురం విగ్రహాల ధ్వంసం మరువకముందే తాజాగా అంతర్వేదిలో రథం దగ్ధంతో హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో వరుసగా హిందూ దేవాలయాలతో పాటు వాటి ఆస్తులపై జరుగుతున్న దాడులు, అంతర్వేది రథం దగ్ధం ఘటనను నిరసిస్తూ.. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు.