ప్రస్తుతం కరోనా మహమ్మారి యావత్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో అన్ని చోట్ల ఈ మహమ్మారికి సంబంధించి చర్చ మాత్రమే జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఎవరికి ఏ డౌట్ వచ్చినా.. గూగుల్ సర్చ్ ఇంజిన్లో వెతకడమే మన భారతీయుల పనైంది. ఒక్క భారతీయులనే కాదు.. ప్రపంచంలోని అనేక దేశాలు ఈ గూగుల్పైనే ఆధారపడి ఉన్నాయి. ఇక మన దేశంలో గత ఆగస్టు నెలలో గూగుల్లో ఎక్కువగా వెతికిన విషయాల గురించిన సమాచారాన్ని గూగుల్ సంస్థ సోమవారం నాడు విడుదల చేసింది.
మన దేశంలో ఎక్కువగా సర్చ్ చేసిన వాటిలో రష్యా కరోనా వ్యాక్సిన్ గురించేనని తెలిపింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మృతికి సంబంధించి వెతికారట. ఆ తర్వాత పాక్- ఇంగ్లాండ్ టీ20 మ్యాచ్, స్పుత్నిక్ వ్యాక్సిన్, స్పుత్నిక్కు సంబంధించి తెగ సర్చ్ చేశారని గూగుల్ వెల్లడించింది. అంతేకాదు.. స్వాతంత్ర దినోత్సవం గురించి కూడ పెద్ద ఎత్తున సర్చ్ చేశారట. ఇక ఆ తర్వాత భారతీయులు వెతికిన టాప్ 10 లిస్టును దిగువన చూడండి.
- అమిత్ షాకు కరోనా పాజిటివ్ వచ్చిందా..?
- బట్టలపై కరోనా వైరస్ ఎన్ని రోజులు ఉంటుంది..?
- రష్యా కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనుగొందా..?
- జియో నెట్వర్క్లో కరోనా కాలర్ ట్యూన్ను ఎలా ఆపాలి..?
- భారత్లో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు లాంచ్ చేస్తారు..?
- బాడీపెయిన్స్ (ఒళ్లు నొప్పులు) కూడా కరోనా లక్షణమా..?
- కరోనాలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది..?
- కరోనా వస్తే ఎన్ని రోజులు లక్షణాలు ఉంటాయి..?
- ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్ వచ్చిందా..?
- ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు కరోనా ఎలా సోకింది..?