ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి తెలిసిందే. ఇప్పటికే 15 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో నాలుగు లక్షల మంది వరకు దీని బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఈ మహమ్మారి మన దేశంలో కూడా వ్యాప్తిచెందుతుండటంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
ఇప్పటికే మార్చి 31 వరకు పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించిన కేంద్రం.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో.. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు.. ఇక దేశ మొత్తం లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
ఈ సంపూర్ణ మూసివేత మూడు వారాలపాటు (21 రోజులు) కొనసాగుతుందన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. తప్పనిసరై ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ మూడు వారాలపాటు మనం దీన్ని నియంత్రించకపోతే.. మనదేశం మరో 21 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సి వస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ సంచలన ప్రకటన చేశారు.
From 12 AM tonight there will be a complete lockdown across the country: PM Narendra Modi #coronavirus pic.twitter.com/Z31lFB4Hz9
— ANI (@ANI) March 24, 2020