తెలంగాణ రాష్ట్రంలో బాణాసంచా కాల్చడంపై నిషేధం ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. గురువారం నాడు తెలంగాణ హైకోర్టు పటాకులు కాల్చివేతపై నిషేదం విధిస్తూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ శుక్రవారం నాడు సుప్రీంకోర్ట్లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ని విచారించిన సుప్రీం ఎన్జీటీ (నేషన్ గ్రీన్ ట్రిబ్యూనల్) తీర్పునకు లోబడి హైకోర్టు ఆదేశాలు ఉండాలని తెలిపింది. వాయు కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాలు, పట్టణాల్లో బాణాసంచా పూర్తిగా నిషేధించాలని ఎన్జీటీ పేర్కొంది.
తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ పిటిషన్ విచారణ చేపట్టిన అనంతరం.. గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవడానికి అనుమతులనిచ్చింది. దీపావళి రోజు.. రెండు గంటలపాటు పటాకులు కాల్చుకునేందుకు వీలుకల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అయితే రెండు గంటలు ఏ సమయంలో అన్నది ప్రభుత్వమే తేల్చాలని పేర్కొంది. కాగా,ఈ కేసు విషయంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కేసును తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది.
Supreme Court modifies the Telangana High Court order and grants partial relief to Telangana Fire Works Dealers Association (TFWDA) allowing the sale and bursting of green crackers for 2 hours during Diwali.
— ANI (@ANI) November 13, 2020