జగన్నాథ భక్తులకు సుప్రీం కోర్టు శుభవార్త తెలిపింది. రథయాత్రకు లైన్ క్లియర్ చేసింది. షరతులతో కూడిన అనుమతినిచ్చింది. పూరి జగన్నాథ ఆలయ కమిటీ సమన్వయంతో ఈ రథయాత్ర కొనసాగించాలని స్పష్టం చేసింది. భక్తులు లేకుండానే రథయాత్ర నిర్వహించాలని సూచించింది. అంతేకాదు.. రథయాత్రను లైవ్ ప్రసారం చేయాలని సుప్రీం ఆదేశించింది. ఈ రథయాత్రకు భక్తులు పెద్ద సంఖ్యలో రాకుండా జాగ్రత్తలు వహించాలని సూచించింది.సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. యాత్రను కొనసాగించాలని తెలిపింది. అంతేకాదు.. ప్రజల ఆరోగ్య సంబంధింత విషయంలో రాజీపడరాదని. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
Supreme Court has allowed Rath Yatra to be conducted in Puri, Odisha with certain restrictions. https://t.co/MhteNWUapm
— ANI (@ANI) June 22, 2020
भगवान जगन्नाथ के भक्तों, केंद्र सरकार के प्रयासों तथा पूज्य सन्तों के आशीर्वाद से माननीय सर्वोच्च न्यायालय ने पावन जगन्नाथपुरी में अब रथयात्रा की अनुमति दे दी है। सभी का अभिनंदन व साधुवाद। आदेश का पूरी तरह पालन करते हुए आगे बढ़ेगा हिन्दू समाज।
— Vishva Hindu Parishad -VHP (@VHPDigital) June 22, 2020
మరోవైపు జూన్ 18న ఇచ్చిన తీర్పుపై యావత్ హిందూ సంఘాలు ఏకమయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్ర జరుగుతుందని.. అందుకు సుప్రీం కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు ఆదివారం రాత్రి.. విశ్వ హిందూ పరిషత్.. యాత్రకు అనుమతులు ఇవ్వాలని.. కోర్టు తలుపులు తట్టింది.
విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి మాననీయ మిలింద్ పరాండే జి పూరీ జగన్నాధ రధయాత్ర నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు నిర్ణయంపై పునస్సమీక్ష చేయాలని సుప్రీమ్ కోర్ట్ ను కోరుతూ గత రాత్రి పిటీషన్ దాఖలు చేసారు.
— Vishva Hindu Parishad -VHP (@VHPDigital) June 22, 2020