గుజరాత్లోని ప్రసిద్ద స్వామి నారాయణ్ మందిర్ జల దిగ్భందంలోకి వెళ్లింది. రాష్ట్రంలోని రాజ్కోట్ జిల్లా గోండల్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అంతేకాదు.. ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగరంలోని బాప్స్ స్వామి నారాయణ మందిరం సోమవారం నాడు వరద నీటిలో చిక్కుకుపోయింది. ఇదిలావుంటే.. ఇతర పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు డ్యామ్లన్నీ నిండిపోవడంతో.. పలు ప్రాంతాల్లో గేట్లు ఎత్తేశారు. దీంతో వరద నీరు పెద్ద ఎత్తున పొంగిపొర్లుతోంది.