తబ్లీగ్ జమాత్ చీఫ్ అడ్రస్‌ కనుగొన్న పోలీసులు..!

Spread the love

సంచలనం సంచలనంగా మారిన తబ్లిగీ జమాత్ వ్యవహారం గురించి తెలసిందే. దేశంలో కరోనా కేసులు కంట్రోల్‌లోకి వస్తున్నాయనుకున్న సమయారన.. మర్కజ్ మీటింగ్‌కు హాజరైన వారికి కరోనా లక్షణాలు ఉన్నాయని తేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హాజరుకాగా.. దాదాపు వెయ్యి మంది వరకు విదేశీయులు కూడా హాజరయ్యారు. వారి ద్వారా ఈ వైరస్ ఇతరులకు కూడా సోకడంతో.. వారంతా వారివారి స్వస్థలాలకు వెళ్లడంతో.. ఒక్క సారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది. అయితే ఈ సమావేశానికి హాజరైన వారిని గుర్తించడంలో ప్రభుత్వాలు తలమునకలవుతున్నాయి. దాదాపు అందరినీ గుర్తించినప్పటికీ.. పలుచోట్ల వారు స్వచ్ఛందంగా అధికారులను సంప్రదించి.. చికిత్స తీసుకోకుండా నిరాకరించడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో అసలు ఈ సమావేశానికి నేతృత్వం వహించిన తబ్లిగీ చీఫ్.. మౌలానా సాద్‌పై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి.. తబ్లిగ్ జమాత్ చీఫ్ పరారీలో ఉన్నాడు.

ఆయన కోసం.. ఢిల్లీ పోలీసులు వేట ప్రారంభించారు. ఆయన ఎక్కడ ఉన్నారన్న దానిపై ట్రేస్‌ చేయడం ప్రారంభించారు. ఎట్టకేలకు క్రైం బ్రాంచ్ పోలీసులు.. ఆయన ఆచూకీని కనుగొన్నారు. ఢిల్లీలోని జాకీర్ నగర్ ప్రాంతంలో.. ఆయన నివాసంలోనే మౌలానా సాద్ క్వారంటైన్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. తబ్లిగ్ జమాత్ చీఫ్ కోసం.. ఢిల్లీతోపాటు యూపీలోని ముజఫర్ నగర్, షామ్లీ ప్రాంతాల్లో ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు తీవ్రంగా గాలించారు. నిజాముద్దీన్ మర్కజ్‌లో జమాత్ సమావేశం నిర్వహించి, దేశవ్యాప్తంగా ఈ వైరస్ ప్రబలేందుకు కారణమైనరన్న ఆరోపణలపై జమాత్ చీఫ్ సాద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.


Spread the love
error: Content is protected !!