అయ్యో పాపం.. ఈ పిల్లి కరోనా బారినపడింది..!

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ లేకపోవడంతో రోజురోజుకు లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు మనుషులకు మాత్రమే సోకగా.. పలు దేశాల్లో పెంపుడు జంతువులకు కూడా కరోనా సోకినట్లు సమాచారం. తాజాగా యూకేకు చెందిన ఓ పిల్లి కూడా కరోనా బారినపడ్డట్లు తెలుస్తోంది. పెంపుడు పిల్లికి సంబంధించిన ఓనర్స్‌ ద్వారా ఈ వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఇంగ్లాండ్‌లోని వేబ్రిడ్జ్‌లోని యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఏజెన్సీలో జూలై 22వ తేదీన కరోనా పరీక్షలు చేపట్టారు.

ఈ క్రమంలో వెలువడిన రిపోర్టులు చూసి వెటర్నరీ వైద్యులు షాక్‌కు గురయ్యారు. రిపోర్టులో ఆ పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఒక జంతువుకు కరోనా సోకడం యూకేలో ఇదే తొలిసారి అని తెలిపారు. ప్రస్తుతం పిల్లి ఆరోగ్యంగానే ఉందన్నారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.. పిల్లి యజమాని ద్వారానే దీనికి కరోనా సోకిందన్నారు. గతంలో యజమాని కరోనా బారినపడ్డారని.. వారి ద్వారానే పిల్లికి సోకిందని స్పష్టం చేశారు. ఇక ఇప్పటి వరకు పెంపుడు జంతువుల నుంచి మనుషులకు సోకుతుందన్నట్లు ఎలాంటి ఆధారాలు మాత్రం లేవని వైద్యాధికారులు తెలిపారు.

దోషులకు ఉరిశిక్ష అమలు.. నిర్భయ తల్లి ఆలోచింపజేసే వ్యాఖ్యలు..! ఏం అన్నారంటే..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార, హత్య ఘటన కేసులో.. దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు చేశారు. ఈ కేసులో దోషులుగా…

error: Content is protected !!