విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరిపించాల్సిందే.. బీజేపీ డిమాండ్‌..!

Spread the love

సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా జరింపించాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత.. స్వరాష్ట్రంలో అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరుపుకోవచ్చని అంతా భావించారని.. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం విముఖత చూపుతోందని ఆరోపించింది.

శనివారం నాడు బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్సీ రాం చందర్ రావు, గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌, రాష్ట్ర సంఘటన కార్యదర్శి మంత్రిజీ, శ్రీ వర్దన్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి గార్ల ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రాబోయే విమోచన దినోత్సవ సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. ఈ విషయాన్ని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

కాగా, గతంలో రాష్ట్రం ఏర్పడ్డాక సెప్టెంబర్ 17వ తేదీన అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరుపుతామన్న సీఎం కేసీఆర్ అప్పటి మాటల్ని మరిచిపోయారని పలువురు బీజేపీ నేతలు ఆరోపించారు.


Spread the love
error: Content is protected !!