ఈటల రాజేందర్కు సీఎం కేసీఆర్ షాకిచ్చారు. ఆయన చేతిలో ఉన్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. సీఎం కేసీఆర్ చేతిలోకి వెళ్లింది. ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్కు బదిలీ చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈటల రాజేందర్ ఎలాంటి శాఖలేని మంత్రిగా ఉండిపోయారు. ప్రస్తుతం ఆయనపై భూ కబ్జా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ఈటల రాజేందర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సిఫారసు మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను @Eatala_Rajender నుంచి ముఖ్యమంత్రికి బదిలీ చేసిన గవర్నర్ @DrTamilisaiGuv pic.twitter.com/dFcBanUN7B
— AIR News Hyderabad (@airnews_hyd) May 1, 2021