తెలంగాణలో బాణాసంచా విక్రయాలు, కాల్చడంపై గురువారం నాడు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న సమచయంలో.. బాణాసంచా కాల్చడంపై హైకోర్టు నిషేధాన్ని విధించింది. దీపావళి పండుగ సందర్భంగా కాల్చే బాణాసంచాపై నిషేధం విధించాలంటూ న్యాయవాది ఇంద్ర ప్రకాశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో క్రాకర్స్ కాల్చడం పెరిగి తీవ్ర ప్రభావం చూపుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే వాదనలు విన్న హైకోర్టు.. ఇప్పటి వరకు తెరిచి ఉన్న క్రాకర్స్ షాప్స్ను మూసేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా క్రాకర్స్ అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని.. ఎలాంటి చర్యలు తీసుకున్నారో.. ఈ నెల(నవంబర్) 19వ తేదీన తెలపాలంటూ హైకోర్టు తెలిపింది.
కాగా, ఇప్పటికే ఢిల్లీ,రాజస్థాన్,కర్నాటక,యూపీ,హర్యానాతో పాటుగా.. పలు రాష్ట్రాలు కూడా క్రాకర్స్పై నిషేధాన్ని విధించాయి. మరోవైపు హిందూ సంఘాలు హైకోర్టు తీర్పుపై మండిపడుతున్నాయి.