రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి మే1వ తేదీ వరకు రాత్రి పూట కర్ఫ్యూను విధించింది. ఇందుకు సంబంధించి ఓ జీవోను కూడా రిలీజ్ చేసింది. రాత్రి 9.00 గంటల నుంచి ఉదయం 5.00 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు జీవోలో స్పష్టం చేసింది. ఇక కర్ఫ్యూ సమయంలో ఎవరికి సడలింపులు ఉంటాయన్నది కూడా వివరంగా పేర్కొంది. కర్ఫ్యూ ఉన్న సమయంలో కేవలం ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొంది. రాత్రి 8.00 గంటల వరకు మాత్రమే రెస్టారెంట్లు, క్లబ్బులు, షాపులకు అనుమతి ఉంటుందని స్పష్టంగా పేర్కొంది. కర్ఫ్యూ సమయంలో షాపులు ఓపెన్ చేసి ఉన్నట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. ఇక కర్ఫ్యూ ఉన్న సమయంలో మెడికల్ షాపులతో పాటు.. డయాగ్నస్టిక్ సెంటర్లకు, ఆస్పత్రులకు.. ఇతర ఎమర్జెన్సీ సేవలకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని జీవోలో పేర్కొంది.
Government of Telangana announces night curfew in the state from 9 PM to 5 AM. The order comes into effect immediately and will remain imposed till May 1st. Essential services to remain exempted. pic.twitter.com/0u4ePfcMo0
— ANI (@ANI) April 20, 2021