మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌.. త్వరగా కోలుకోవాలని ప్రార్ధించిన బండి సంజయ్‌..!

Spread the love

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే. తారకరామ రావు (కేటీఆర్) కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో తనతో సన్నిహితంగా ఉన్న వారంతా కరోన టెస్టులు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించారు. కాగా, ఇటీవల సీఎం కేసీఆర్‌కు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. బుధవారం నాడు సీఎం కేసీఆర్‌ యశోదా ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం వచ్చిన సమయంలో మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే గురువారం నాడు సంతోష్‌ కరోనా బారినపడగా.. శుక్రవారం నాడు మంత్రి కేటీఆర్‌ కూడా కరోనా బారినపడ్డారు.

అయితే మంత్రి కేటీఆర్‌ కరోనా బారినపడ్డ విషయం తెలిసిన వెంటనే.. బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ కుమార్‌ స్పందించారు. మంత్రి కేటీఆర్‌ గారు కరోనా బారినపడ్డారన్న వార్త వినడంతో ఆందోళన కల్గించిందని.. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్దిస్తున్నట్లు తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.

 

 

 

 


Spread the love
error: Content is protected !!