ఓ హిందూ మేలుకో…!!ఆ గుడికి టూ వీలర్‌పై వెళ్లాలంటే జేబుకు చిల్లేనట..!తెలంగాణలో ఏం జరుగుతోంది..?

Spread the love

ఇప్పటికే దేవాదాయ ధర్మాదాయ శాఖ పేరిట గుళ్ళలో హిందువులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నాయి ప్రభుత్వాలు.
ఉచిత దర్శనం కల్పించాల్సిన చోట కూడా.. ప్రత్యేక దర్శనల పేరుతో వంద, వేల రూపాయల టిక్కెట్ల పేరుతో భక్తులను నిలువు దోపిడి చేస్తున్నాయి. ప్రత్యేక పూజలు, అర్చనలు, ప్రసాదాలను రుసుములను అటుంచింతే.. వాహన పార్కింగ్‌కు, లగేజీ బ్యాగేజీలకు అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ పరంగా అయితే.. మరికొన్ని చోట్ల ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేటు వ్యక్తులు దోపిడికి దిగుతున్నారు. అయితే వాహనాల పార్కింగ్‌ విషయంలో కార్లు,బస్సులకు మాత్రమే ఛార్జీలు వసూలు చేయడం చూశాం.. కానీ అచ్చంపేట నల్లమల్ల అటవీ ప్రాంతంలో మాత్రం టూ వీలర్‌ వాహనాలకు కూడా డబ్బులు వసూలు చేయడం చూసి షాక్‌ తింటున్నారు భక్తులు.

వివరాల్లోకి వెళితే… అచ్చంపేట్ నల్లమల్లలో వెలిసిన పవిత్ర శైవ క్షేత్రం ఉమా మహేశ్వరం, ఆంజనేయ స్వామీ దేవాలయం మద్దిమడుగు దేవాలయాలకు వెళ్లే రహదారిలో అక్రమ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి భక్తుల వచ్చే వాహనాల వద్ద నుంచి అక్రమంగా చెక్‌పోస్టు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. టూ-వీలర్‌కు 30 రూపాయలు , ఆటోకు 50 రూపాయలు, కారుకు 60 రూపాయలు, బస్సుకు 100 రూపాయలను వసూలు చేస్తున్నారు. ఈ చెక్‌పోస్టును అక్రమంగా పెట్టారంటూ శివసేన పార్టీకి చెందిన యువసేన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ అభ్యర్థి సింకారు శివాజీ ఆరోపిస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు చెక్‌పోస్టు పెట్టి అక్రమంగా వసూలు చేస్తున్న డబ్బులను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ సింకారు శివాజీ డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించి శివాజీ పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ ధర్నా కూడా చేపట్టారు. హిందూ దేవాలయాలకు వెళ్లే దారిలో ఈ అక్రమ చెక్ పోస్టులను తొలగించకపోతే భారీ ఉద్యమం చేపడతామని. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక టీఆర్‌ఎస్ MLA స్పందించి ఈ అక్రమ చెక్ పోస్టులను వెంటనే తొలగించకపోతే.. నిరాహారదీక్షకు దిగుతానంటూ సింకారు శివాజీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హిందువులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, హిందూ సంఘాలను కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా చేపడుతామన్నారు.


Spread the love
error: Content is protected !!