అంతర్వేదిలో అగ్ని ప్రమాదం.. శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వారి కళ్యాణరథం దగ్ధం..!

Spread the love

తూర్పు గోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ప్రమాదం చోటుచేసుకుంది. సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణ సమీపంలోని కళ్యాణోత్సవ రథం అగ్నిప్రమాదానికి గురైంది. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున 1.00 గంట ప్రాంతంలో చోటుచేసుకుంది. మందిరానికి 200 మీటర్ల దూరంలోని ఓ షెడ్డులో ఈ రథాన్ని భద్రపరిచారు. అయితే అకస్మాత్తుగా అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో స్వామి వారి రథం పూర్తిగా దగ్ధం అయిపోయింది. ఈ రథాన్ని అరవై ఏళ్ల క్రితం టేకు కలపతో తయారు చేయించారు. ఇది 40 అడుగుల ఎత్తు ఉంది. ప్రతి ఏటా స్వామి వారి కళ్యాణోత్సవాల్లో భాగంగా ఘనంగా రథోత్సవం జరుగుతుంది.

అయితే ఈ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు తావిస్తున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిందా.? లేదా ఎవరైనా కుట్రపూరితంగా ఆకతాయిలతో ఈ పని చేయించారా అన్న అనుమాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Spread the love
error: Content is protected !!