బయట పడ్డ ఉగ్రస్థావరం.. మరెక్కడో కాదు..అక్కడి అడవుల్లోనే..!

Spread the love

ఇన్నాళ్లు ఉగ్రవాద స్థావరాలన్నీ పాకిస్థాన్,POK, సరిహద్దుల్లో ఉన్నాయని అనుకునేది.కానీ బుధవారం నాడు జమ్మూకాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలోని అకల్ అడవుల్లో సాయుధ బలగాలు,స్థానిక పోలీసులు కూంబింగ్ చేపట్టాయి. ఈ సోదాల్లో లష్కరే తోయిబాకు చెందిన ఓ ఉగ్ర స్థావరం బయట పడినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ స్థావరాన్ని తనిఖీ చేయగా.. అందులో పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రితో పాటుగా.. పేలుడు పరికరాలను తయారు చేసే ముడి పదార్థాలు, ఉగ్రవాదం వైపు ప్రభావితం చేసే పలు పుస్తకాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.

కాగా గతంలో కూడా ఇలాంటి స్థావరాలను గుర్తించి స్వాధీనం చేసుకున్న సందర్బాలు ఉన్నాయి.
అయితే తాజాగా పలువురు లష్కర్ తోయిబా ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే.


Spread the love
error: Content is protected !!