గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌ చేరుకున్న రష్యన్‌ వ్యాక్సిన్‌ “స్పుత్నిక్‌ వీ”

Spread the love

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో పాటు.. కరోనా బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం ఈ మహమ్మారికి వ్యాక్సినేషన్‌తో చెక్‌ పెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్‌ కూడా ముఖ్యమని వైద్యాధికారులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే దేశంలో మూడు దశల్లో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగగా.. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల పైబడ్డ వారికి కూడా వ్యాక్సిన్‌ వేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రారంభం కాగా.. మరి కొన్నిచోట్ల వ్యాక్సిన్‌ కొరతతో ఆలస్యంగా ప్రారంభమవుతోంది.

అయితే వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలకు చెందిన వ్యాక్సిన్‌లను కూడా దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున ఆర్డర్ చేసింది. తొలి విడుతగా ఇవాళ మధ్యాహ్నం భారత్‌కు చేరుకున్నాయి. రష్యా నుంచి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌తో బయలు దేరిన విమానం నేరుగా హైదరాబాద్‌ చేరుకుంది. మొత్తం లక్షా 50 వేల స్పుత్నిక్‌ వీ డోసులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరి కొద్ది రోజుల్లో మరో 30 లక్షల డోసుల వ్యాక్సిన్ భారత్‌కు రానుంది. ప్రస్తుతం నగరానికి చేరుకున్న వ్యాక్సిన్‌లు డాక్టర్ రెడ్డీస్‌ లేబరేటరీస్‌కు డెలివరీ చేయనున్నారు. భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ తయారీకి రష్యన్‌ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌తో రెడ్డీస్‌ లేబోరేటరీస్‌ చేతులు కదిపింది. కాగా, గత నెల 13వ తేదీన స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.


Spread the love
error: Content is protected !!