బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో నివసిస్తున్న హిందువులకు ఇస్లామిక్ జిహాదీల వేధింపులు పెరిగాయి. మతం మారుతారా..? లేక దేశాన్ని విడిచిపోతారా..?అంటూ బెదిరింపులు ఒకవైపు చేస్తూ.. మరోవైపు హిందూ యువతులను కిడ్నాప్ చేస్తూ.. బలవంతపు మతమార్పిడి చేసి వివాహాలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా.. భోలా పట్టణ ప్రాంతంలోని ఛర్ఫ్యాషన్ సమీపంలో చోటుచేసుకున్న దారుణ సంఘటన కలకలం రేపుతోంది.
తపన్ షీల్ (అమిత్), దులాల్ షీల్ అనే ఇద్దరు సోదరులు భారత్ నుంచి బంగ్లాదేశ్కు వెళ్లారు. అయితే వీరికి బంగ్లాదేశ్లో స్థలం ఉండటంతో.. దానిని అమ్మేసి తిరిగి భారత్కి శాశ్వతంగా వచ్చేద్దామనుకున్నారు. అయితే వారి ఆశల్ని బంగ్లాదేశ్ జిహాదీ మూకలు అడియాశలు చేశాయి. అక్కడి ఇస్లామిక్ జిహాదీ మూకల చేతిలో వారు దారుణంగా హత్యగావింపబడ్డారు. దుండగులు ఆ ఇద్దరు హిందూ సోదరుల తలల్ని నరికేశారు. అంతేకాదు.. వారి శరీరాలను కాల్చేశారు. ఈ సంఘటన ఏప్రిల్ 8వ తేదీన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బెల్లాల్, అబూ మజ్హీ, కాశెంలుగా గుర్తించారు. మరో ఆరుగుర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పదునైన ఆయుధాలతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. ఈ హత్యలో మరికొంత మంది పాత్ర కూడా ఉందని.. త్వరలో వారిని కూడా పట్టుకుంటామంటూ భోలా పోలీసు సూపరింటెండెంట్ మొహ్మద్ కైజర్ అహ్మద్ తెలిపారు.
పోలీసులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. అస్లాంపూర్ యూనియన్లో ఉన్న సుందరి వంతెన సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏప్రిల్ 8వ తేదీన అక్కడ రెండు తలలు లేని కాలిపోయిన శరీరాలను గుర్తించామన్నారు. మృతులను చార్ఫ్యాషన్ మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన తపన్ షీల్, దులాల్ షీల్గా గుర్తించామన్నారు. భూ వివాదం నేపథ్యంలోనే ఈ దారుణ హత్యలు జరిగాయని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.
అయితే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మాత్రం.. మృతుల కుటుంబం భారత్లో నివసిస్తుందని.. అయితే వీరు చార్ప్యాషన్ మున్సిపల్ ప్రాంతంలో ఉంటున్నారని తెలిపారు. వీరికి ఉన్న భూమిని అస్లాంపూర్ 4వ వార్డుకు చెందిన అబూ జాఫర్ అలియాస్ ఫరాజికి విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డబ్బులను తీసుకుని వెళ్లేందుకు వారు భారత్ నుంచి వచ్చారని.. అయితే డబ్బులు ఇవ్వకుండా ఇలా హత్యచేసి ఉంటారని అక్కడి స్థానిక హిందువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఇదే కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బంగ్లాదేశ్లో మైనార్టీల ల్యాండ్ను లాక్కుని ఇలా డబ్బులు ఇవ్వకుండా హత్యలు చేస్తూ హిందువుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నట్లు పలు హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. గగనం న్యూస్ ప్రత్యేకం.
2 brothers, Amit & Dulal lost their lives when they came from India to take money sell land in CharFashion,Bhola, Bangladesh.
The land buyers in planned way killed the 2 brothers
On April 8, police recovered 2 headless burnt bodies & arrested Bellal,Abu Majhi & Kashem on Friday pic.twitter.com/OXKbTX7Is8
— Raju Das 🇧🇩 (@RajuDas7777) April 24, 2021