మహా సీఎం ఉద్దవ్ థాక్రే ఫామ్ హౌస్లోకి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బిల్వాలీ గ్రామంలో ఈ సంఘటన మంగళవారం నాడు చోటుచేసుకుంది. అరెస్ట్ అయిన ముగ్గురిలో ఇద్దరు ఇంగ్లీష్ ఛానెల్కు చెందిన జర్నలిస్టులని తేలింది.
మంగళవారం సాయంత్రం సీఎం ఫామ్ హౌస్ ఉన్న బిల్వాలీ గ్రామంలో.. స్థానికులను ముగ్గురు వ్యక్తులు ఫామ్ హౌస్ గురించి ఎంక్వైరీ చేశారని తెలుస్తోంది. అయితే సదరు ముగ్గురు వ్యక్తులు గ్రామంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తిని ఫామ్ హౌస్ అడ్రస్ అడగడంతో.. ఆ వ్యక్తి తెలియదని సమాధానం ఇచ్చాడు. దీంతో వెతుక్కుంటూ ఆ వ్యక్తులు సీఎం ఫామ్ హౌస్ చేరుకున్నారు. అయితే అక్కడ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి.. వారికి మధ్యలో ఎదురైన వ్యక్తి ఒక్కరే అని గుర్తించారు. తమకు అడ్రస్ తెలియదంటూ అబద్దాలు ఎందుకు ఆడావంటూ తనపై దాడికి దిగినట్లు బాధితుడు ఆరోపించాడు. ఆ తర్వాత వారు అక్కడి నుంచి వెళ్లిపోయారన్నాడు.
కాగా, ఈ ఘటనపై సదరు సెక్యూరిటీ గార్డ్.. స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తాము ఓ ఇంగ్లీష్ చానెల్కు చెందిన జర్నలిస్టులమంటూ తెలిపారు.