బిగ్ బ్రేకింగ్.. భారత్- చైనాల మధ్య ఘర్షణ.. సైన్యాధికారి, ఇద్దరు జవాన్లు వీరమరణం..

Spread the love

డ్రాగన్‌ కంట్రీ తన జిత్తుల మారి వేశాలను ప్రదర్శిస్తోంది. ఓ వైపు శాంతి చర్చలు జరుపుతామంటూ కయ్యానికి కాలుదువ్వుతోంది. తాజాగా సోమవారం లడఖ్‌లోని గల్వాన్‌ ప్రాంతంలో భారత సైన్యంపైకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో భారత్‌కు చెందిన ఓ సైనికాధికారితో సహా.. ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారని.. పలు నేషనల్ న్యూస్‌ ఏజెన్సీస్ పేర్కొన్నాయి. అంతేకాదు.. దాదాపు అన్ని జాతీయ మీడియా ఛానెల్స్‌ ఈ వార్తల్ని ప్రచురిస్తున్నాయి. మరోవైపు విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ
తలెత్తిందని.. ఈ క్రమంలో రాళ్లతో కొట్టుకుంటూ.. భౌతిక దాడులకు పాల్పడి కొట్టుకున్నారని.. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయారని సమాచారం. ఈ సంఘటన లడాక్‌లోని ప్యాంగాంగ్‌లో చోటుచేసుకుంది.  దీనికి సబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా,1962 తర్వాత తొలిసారిగా మళ్లీ భారత్‌-చైనా మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. అప్పటి నుంచి చైనా దాడిలో తొలిసారి మళ్లీ జవాన్లు వీరమరణం పొందారు.

 


Spread the love
error: Content is protected !!