ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అన్ని దేశాలు ఇప్పుడు కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్నాయి. ఇక మనదేశం కూడా కరోనాతో యుద్ధం చేస్తోంది. ఒక్క కరోనాతోనే కాదు.. ఇటు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో కూడా యుద్ధం చేస్తోంది. ఇప్పటికే లాక్డౌన్ విధించినప్పటి నుంచి పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. తాజాగా జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాల్లో రెండు చోట్ల జరిగిన ఎన్కౌంటర్లలో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం సాయంత్రం కుల్గాం జిల్లాలోని గుద్దర్ గ్రామ సమీపంలోని దేవ్సర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Jammu & Kashmir: Four terrorists have been killed in the encounter between personnel of Indian Army, Central Reserve Police Force, police & terrorists in Gudder area of Kulgam district. Operation is still underway. (Visuals deferred by unspecified time) pic.twitter.com/x1pWBQwiiy
— ANI (@ANI) April 26, 2020
ఇక ఇదే జిల్లాలోని దక్షిణ కశ్మీర్ ప్రాంతంలో కూడా మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. లోయర్ ముందా ప్రాంతంలో టెర్రరిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు సోమవారం ఉదయం కూంబింగ్ చేపట్టాయి. దీంతో జవాన్లను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. ఉగ్రవాదులపై ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Three terrorists neutralised in an ongoing operation in Kulgam's Lower Munda: Indian Army#JammuAndKashmir pic.twitter.com/7puB0DQzvQ
— ANI (@ANI) April 27, 2020
ఇదిలా ఉంటే.. గత వారం రోజుల్లో దక్షిణ కశ్మీర్ ప్రాంతంలో ఇది నాలుగో ఎన్కౌంటర్. ఈ నాలుగు ఎన్కౌంటర్లలో 14 మంది ఉగ్రవాదులు హతమవ్వగా.. ఈ ఏప్రిల్ నెలలో ఇప్పటికీ 26 మంది ముష్కరులు భారత సైన్యం చేతిలో చనిపోయారు. మొత్తం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 50 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.
కాగా.. సరిహద్దుల్లోని కథువా జిల్లాలోని హీరానగర్ ప్రాంతంలో కూడా ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారం అందడంతో.. భద్రతా బలగాలు కూంబింగ్ చేపడుతున్నాయి.