కేసీఆర్‌ తీరుపై రేవంత్‌ రెడ్డి సంచలన ట్వీట్‌..!.. మేము ఎలా నమ్మేది..?

Spread the love

సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ చీఫ్‌, మల్కాజ్‌ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్‌ అయ్యారు. సీఎం కేసీఆర్‌ మాటలను ఎలా నమ్మాలంటూ ప్రశ్నించారు. ఇటీవల సీఎం కేసీఆర్ కేంద్రం వెనక్కి తీసుకున్న మూడు రైతు చట్టాలపై స్పందిస్తూ.. పంజాబ్‌ రైతుల మరణాల విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు.. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రాణత్యాగాలు చేసిన రైతులకు రూ. 3 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర సాధనలో అమర వీరుల కుటుంబాలను గుర్తించడంలో పూర్తిగా విఫలమైందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అమరుల కుటుంబాలకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని కేసీఆర్‌ తీరుపై మండిపడ్డారు. ఇక ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం టీఆర్‌ఎస్ పాలనలో 7500 మంది రైతులు మరణఙంచారని.. అనధికారికంగా ఇది 40,000 ఉంటుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇక గతేడాది హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు అనేకమంది నష్టపోయారని.. బాధితులకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించి.. ఇప్పటి వరకు అనేకమందికి ఇవ్వలేందన్నారు. ఈ క్రమంలో పంజాబ్‌లో మరణించిన రైతులకు రూ.3లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తే.. దీనిని ఎలా నమ్మాలంటూ ప్రశ్నించారు.


Spread the love
error: Content is protected !!