టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్ టెల్,ఐడియా, వోడాఫోన్ కంపెనీలకు భారీ షాక్ ఇచ్చింది. ఈ కంపెనీలు కస్టమర్లకు అందిస్తున్న ప్రీమియం ప్లాన్ష్కు చెక్ పెట్టింది. ఈ కంపెనీలు ప్రవేశపెట్టిన ప్లాన్స్ ద్వారా కస్టమర్ సర్వీసు విషయంలో నాణ్యత లోపిస్తుందని ఆరోపించింది. ఎయిర్ టెల్ ప్రవేశపెట్టన ప్లాటినమ్ ప్లాన్, వోడాఫోన్-ఐడియా ప్రవేశపెట్టిన రెడ్ఎక్స్ ప్రీమియం ప్లాన్స్ను ట్రాయ్ కంప్లీట్గా బ్లాక్ చేసింది. ఈ కంపెనీలు పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ఈ ప్లాన్స్ను ప్రవేశపెట్టాయి. వీటిలో డాటా స్పీడ్తో పాటు.. కస్టమర్ కేర్ సేవలు కూడా
ప్రత్యేకంగా లభిస్తాయి. ఈ క్రమంలోనే ట్రాయ్ ప్రీమియం ప్లాన్స్ను బ్లాక్ చేసింది. డాటా వేగంతో పాటు.. కస్టమర్ కేర్ సర్వీసు విషయంలో వినియోగదారులను ప్రత్యేకంగా చూడటమనేది సరైంది కాదని.. సర్వీసు విషయంలో నాణ్యత తప్పుతుందని ట్రాయ్ అభిప్రాయపడింది. దీంతో వెంటనే కంపెనీలు స్పందించేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా ప్లాన్స్ను రద్దు చేసింది.
TRAI (Telecom Regulatory Authority of India) has blocked Bharti Airtel’s Platinum and Vodafone Idea’s RedX premium plans that offer faster data speeds and priority services to customers. pic.twitter.com/zBhgmjyk6k
— ANI (@ANI) July 13, 2020