దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నాడు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. నార్త్ వెస్ట్ ఢిల్లీ ప్రాంతంలో ఢిల్లీ స్పెషల్ పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు బబ్బర్ ఖల్సా అంతర్జాతీయ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పంజాబ్లో కూడా పలు కేసులు ఉన్నట్లు ఢిల్లీ స్పెషల్ పోలీసులు తెలిపారు.
పట్టుబడ్డ ఇద్దరు బబ్బర్ ఖల్సా ఉగ్రవాదుల్ని బుపేందర్ అలియాస్ దిల్వార్ సింగ్, కుల్వంత్ సింగ్గా గుర్తించారు. వీరి వద్ద నుంచి ఆరు పిస్టల్స్, 40 క్యాట్రేడ్జెస్తో పాటు ఇతర ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఇద్దరు ఉగ్రావాదులపై పంజాబ్లో కేసులు ఉండటమే కాకుండా.. వీరిద్దరు వాంటెడ్ లిస్టులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.