ఇప్పటికే భారత్, పాక్ల మధ్య గ్యాప్ చాలా ఉంది. పాక్ వక్రబుద్ధిని ప్రదర్శిస్తూ.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. సరిహద్దుల వెంట కాల్పులకు దిగుతోంది. మరోవైపు ఇటీవల పాక్లోని మన అధికారులను కొందరు వెంబడించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువకముందే.. సోమవారం ఉదయం ఇద్దరు భారత దౌత్యఅధికారులు అదృశ్యమయ్యారని తెలుస్తోంది. ఈ విషయాన్ని నేషనల్ న్యూస్ ఏజెన్సీ (ఏఎన్ఐ) తన అధికారికి ట్విట్టర్లో పేర్కొంది. మరో జాతీయ మీడియ తెలిపన కథనం ప్రకారం.. పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ ఆఫీస్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అధికారులు గత రెండు గంటలుగా కనిపంచడం లేదు. ఈ విషయం గమనించిన స్థానిక అధికారులు.. పాక్ ప్రభుత్వానికి విషయాన్ని తెలిపారు. దీంతో లోకల్ పోలీసులు రంగంలోకి దిగి.. మిస్సింగ్ అయిన అధికారుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇదిలావుంటే.. భారత ప్రభుత్వం కూడా దౌత్యవేత్తల అదృశ్యంపై పాక్
ప్రభుత్వాన్ని ఆరాతీసినట్లు తెలుస్తోంది.
Two Indian officials working with Indian High Commission in Islamabad (Pakistan) are missing: Sources
— ANI (@ANI) June 15, 2020
Ministry of External Affairs (MEA) has taken up the matter of untraceable Indian officials (working with Indian High Commission in Islamabad) with Pakistan: Sources pic.twitter.com/gIkbWMGI12
— ANI (@ANI) June 15, 2020